న్యూఢిల్లీ: ఇంటర్నెట్లో సమాచారం కావాలంటే మనం సెర్చింజన్గా పేరొందిన గూగుల్ క్రోమ్కు వెళతాం.. గూగుల్ క్రోమ్తోపాటు సెర్చింజన్లుగా ఆపిల్ సఫారీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, మొజిల్లా ఫైర్ఫాక్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ సంస్థలు ఎల్లవేళలా పరస్పరం పోటీదారులుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు యూజర్లకు మెరుగైన సేవలు అందించడానికి కలిసి పని చేయనున్నాయి.
ఈ నాలుగు సంస్థల కలయికతో యూజర్లు మరింత మెరుగ్గా సెర్చ్ రిజల్స్ తెలుసుకోవడానికి, బ్రౌజర్ ఎక్స్టెన్షన్తో యూజర్ల సమాచారం సురక్షితంగా ఉంటుంది. దీనివల్ల యూజర్ల డౌన్లోడ్ సామర్థ్యం మెరుగవుతుందని పేర్కొంటూ సీనెట్ ఓ కథనం ప్రచురించింది.
నాలుగు సెర్చింజన్లు కలిసి పని చేసేందుకు వాటిని మిక్స్ చేయాలని సంబంధిత సంస్థల యాజమాన్యాలు తమ ఇంజినీర్లను కోరాయి. ఈ సంస్థలు వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం కింద కలుస్తామని ప్రకటించాయి.
భారీ స్థాయిలో ఎక్స్టెన్షన్ కోసం ఇటువంటి మోడల్కోసం కొన్నేండ్లలో నాలుగు సంస్థలు ప్రయత్నించాయి. ఈ నాలుగు సెర్చింజిన్ల సమ్మేళనంతో ఒకేసారి పలు బ్రౌజర్లు పని చేస్తాయి. వీటి కలయికతో నెట్ సర్ఫింగ్ సురక్షితం కానున్నది. సెర్చింగ్ ఫలితాలు త్వరితగతిన వస్తాయి.
డెవలపర్లు తేలిగ్గా ఎక్స్టెన్షన్ పొందాలన్న ఆలోచన ఈ నాలుగు సంస్థలు కలిసి పని చేయడానికి గల కారణాల్లో ఒకటి. ఏపీఐ, పర్మిషన్లకు స్థిరమైన మోడల్ కామన్ కోర్గా ఉంటుంది.
షాకింగ్ :సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా ఊపందుకోని నియామకాలు!
E-Commerce బలోపేతమే లక్ష్యం: క్యూర్ఫిట్లో టాటా పెట్టుబడులు
ఇండియాలో లాంచ్ అయిన మరో ఖరీదైన కారు
భారత్లోనూ క్రిప్టో ఒక అసెట్: నందన్ నిలేకని సంచలనం!!
టాప్ గెయినర్స్ జాబితాలో… బ్రిటానియా,హెచ్ సీఎల్ టెక్..
వ్యాక్సిన్ తీసుకున్న వరుడు కావాలి.. ఇదీ శశీ థరూర్ పంచ్
నేనేమీ నవాజ్ షరీఫ్ను కలిసేందుకు వెళ్లలేదు..
అమరావతి ఎంపీ నవనీత్ కౌర్కు బాంబే హైకోర్టు షాక్
పుణె పరిశోధన : కరోనా కొత్త వేరియంట్ గుర్తింపు
వృథా చేస్తే ఇచ్చే వ్యాక్సిన్లలో కోత.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు
అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో అగ్ని ప్రమాదం
వాట్సాప్ స్టేటస్.. రిపోర్టర్పై కేసు