శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఉదయం 6.21 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 2.5 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. కత్రాకు 82 కిలోమీటర్ల దూరంలో, భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. అయితే, ప్రకంపనలతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలిపింది. ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురై బయటకు పరుగులు పెట్టారు. ఇంతకు ముందు ఈ నెల 1న సైతం కాశ్మీర్లో ప్రకంపనలు వచ్చాయి.