కీసర, మే 23 : బాల్యవివాహాన్ని కీసర పోలీసులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నాగారం మున్సిపల్ పరిధి రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన యువకుడిని, చర్లపల్లి ప్రాంతానికి చెందిన యువతికి పెండ్లి చేసేందుకు బంధువులు నిశ్చయించారు. యువతి ఇటీవలనే పదవ తరగతి పూర్తికాగా.. 16 ఏండ్లు ఉంటుంది. అయితే ఆదివారం పెండ్లి జరుపుతుండగా.. విషయం తెలుసుకున్న కీసర సీఐ నరేందర్గౌడ్, నాగారం ఎస్సై రమేశ్ వివాహ వేదిక వద్దకు చేరుకుని.. పెండ్లిని నిలిపివేశారు. ఇరుపక్షాల వారికి కౌన్సెలింగ్ ఇచ్చి.. మరో రెండు సంవత్సరాల తర్వాత వివాహం చేయాలని సూచించారు. పెండ్లికూతురుకు 18 ఏండ్లు నిండనిది పెండ్లిచేయాలని చూస్తే.. కేసు నమోదు చేస్తామని తెలిపారు. దీంతో పెండ్లిని వాయిదా వేశారు.