వనపర్తి : కొత్తకోట మండల కేంద్రంలో ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానకు వచ్చే రోగులకు అందించే సేవలపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాలలో కేసులు పెరగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో ఇంటింటి జ్వర సర్వే మంచి ఫలితాలను ఇస్తుందనారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి మందులు అందించడం ద్వారా కరోనా వ్యాప్తి తగ్గుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
ఇవి కూడా చదవండి..
చెరువులో విష ప్రయోగం..చేపలు మృతి
మెడికల్ హబ్గా వరంగల్ : మంత్రి సత్యవతి రాథోడ్
దాతృత్వం స్ఫూర్తి దాయకం : మంత్రి జగదీష్ రెడ్డి
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులో ఆంక్షలు కఠినతరం
నేను రాను బిడ్డో అంటున్న ఫాదర్ స్టాన్ స్వామి