జిన్నారం/నారాయణఖేడ్/వట్పల్లి/పుల్కల్ రూరల్/ సిర్గాపూర్/అందోల్, మే 20 : వానకాలం సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు ఎరువులు, విత్తనాలు అందజేయాలని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ వ్యవసాయాధికారులకు సూచించారు. గురువారం జోగిపేట వ్యవసాయశాఖ కార్యాలయంలో మండలంలోని రైతులకు జీలుగు, జనుము విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. ఎరువులు, విత్తనాలు అందజేయడంతో పాటు పంట పెట్టుబడికి అవసరమయ్యే డబ్బులు సైతం ప్రభుత్వమే అందజేస్తున్నదని చెప్పారు. అనంతరం ఏడీఏ అరుణ మాట్లాడుతూ రైతులకు సబ్సిడీపై జనుము, జీలుగు విత్తనాలు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. విత్తనాలు అవసరమున్న రైతులు పట్టాపాసుబుక్కు, ఆధార్కార్డు తీసుకొచ్చి విత్తనాలు తీసుకోవాలన్నారు. జీలుగు సబ్సిడీ పోను 30కిలోల బస్తా రూ.561. జనుము 40కిలోల బస్తా రూ.929 చెల్లించి తీసుకువెళ్లాలని సూచించారు. ఆత్మ చైర్మన్ యాదగిరిరెడ్డి, ఎంపీపీ బాలయ్య, జడ్పీటీసీ రమేశ్, ఏవో సారిక, ఏఈవోలు శ్రీకర్, అనిత, రైతులు పాల్గొన్నారు.
ఇబ్బందులు రానివ్వం : ఆర్డీవో
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని నారాయణఖేడ్ ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్ అన్నారు. మండల పరిధిలోని కడ్పల్, పోచాపూర్, సుల్తానాబాద్, సిర్గాపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. ఆయన వెంట మండల గిర్దావర్ నారాయణ, వీఆర్వోలు ఉన్నారు.
రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి
పుల్కల్ మండల కేంద్రమైన పుల్కల్ ఆగ్రోస్ రైతు సేవా కేంద్ర, మన గ్రోమార్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రాల్లో జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
పంపిణీకి సిద్ధంగా ..
వట్పల్లి వ్యవసాయశాఖ కార్యాలయంలో రైతులకు పంపిణీ చేసేందుకు గాను జనుము, జీలుగు విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని మండల వ్యవసాయాధికారి మహేశ్ చౌహాన్ గురువారం తెలిపారు. రైతులకు సబ్సిడీపై అందజేయనున్నట్లు పేర్కొన్నారు. రైతులు పట్టాపాస్బుక్కు, ఆధార్కార్డు జీరాక్స్ తీసుకువచ్చి విత్తనాలు తీసుకువెళ్లాలని సూచించారు.
కొవిడ్ నిబంధనలు పాటించాలి
ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఏడీఏ కరుణాకర్రెడ్డి సూచించారు. గురువారం నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కరుణాకర్రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కల్గకుండా కొనుగోళ్లు జరపాలని సూచించారు. ఆయన వెంట ఏఈవో రాందాస్ తదితరులు ఉన్నారు.
నేడు జీలుగ విత్తనాలు పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే
జిన్నారం మండలంలోని సోలక్పల్లి పీఎసీఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి శుక్రవారం రైతులు జీలుగ విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు ఏఈవో యోగేశ్వర్రెడి తెలిపారు.