బాలానగర్ లయన్స్ క్లబ్ కంటి దవాఖాన యాజమాన్యం రాచకొండ పోలీసులకు మంగళవారం ఓ అంబులెన్స్, ఐదు ఆక్సిజన్ సిలిండర్లను అందించింది. నేరేడ్మెట్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ను కలిసి వాటిని అందజేశారు. కరోనా బారినపడ్డ వారిని దవాఖానలకు, కరోనా బారినపడి మరణించిన మృతదేహాలను అంత్యక్రియలకు తరలించడానికి ఈ అంబులెన్స్ సేవలను ఉపయెగించుకోవాలని లయన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ఈ సేవలను పొందేందుకు రాచకొండ కొవిడ్ కంట్రోల్ రూమ్ నెం. 94906 17234 లేదా డాక్టర్ కార్తిక్ 80089 43220 / 96665 55296 లేదా కిరణ్..88865 55063 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.