అమరావతి : విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (విమ్స్) డైరెక్టర్గా డాక్టర్ రాంబాబు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం విమ్స్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ సత్య వరప్రసాద్ శనివారం విధుల నుంచి రిలీవ్ కావడంతో ఆయన స్థానంలో డాక్టర్ రాంబాబు బాధ్యతలు చేపట్టారు.
ఆంధ్రా మెడికల్ కళాశాల ఆచార్యుడిగా కొనసాగుతున్న రాంబాబును ప్రభుత్వం విమ్స్ డైరెక్టర్గా నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర కొవిడ్ ప్రత్యేక అధికారిగాను ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం కొవిడ్ ప్రత్యేక ఆస్పత్రిగా విమ్స్ సేవలందిస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.