క్యాండీ: అరంగేట్ర మ్యాచ్లోనే ప్రవీణ్ జయవిక్రమ (6/92, 5/86) దుమ్మురేపడంతో బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక 209 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ప్రవీణ్ ధాటికి సోమవారం బంగ్లా రెండో ఇన్నింగ్స్లో 227 పరుగులకు ఆలౌటవడంతో.. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను లంక 1-0తో చేజిక్కించుకుంది. తొలి టెస్టులో డబుల్ సెంచరీతో పాటు రెండో మ్యాచ్లో సెంచరీతో కదం తొక్కిన లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నెకు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక 493/7వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. బంగ్లా మొదటి ఇన్నింగ్స్లో 251 పరుగులకే ఆలౌటైంది. తర్వాత లంక 194/9 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. 437 క్ష్యఛేదనలో బంగ్లా 227 పరుగులకు ఆలౌటైంది.