జయశంకర్ భూపాలపల్లి : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నది. రైతులు ఢిల్లీ వీధుల్లో నెలల తరబడి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ మాత్రం రైతుల సంక్షేమం కోసం కొనుగోలు ఏంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. జిల్లాలోని
భూపాలపల్లి మండలం గొర్లవేడు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని దళారులకు అవకాశం ఇవ్వకుండా రూ. 20 వేల కోట్ల రుణం తీసుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాతని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
భార్యను వేట కొడవలితో నరికి చంపిన భర్త
బైక్ను ఢీకొట్టిన లారీ..ఆర్ఎస్ఐ మృతి
నాగార్జునసాగర్ ఎన్నికల ఫలితాల లైఫ్ అప్డేట్స్