బాలీవుడ్ లెజెండరీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ చనిపోయి అప్పుడే ఏడాది అయిపోయింది. గత ఏడాది సరిగ్గా ఇదే రోజు ఏప్రిల్ 29న క్యాన్సర్తో ఆయన మరణించారు. ఇవాళ ఇమ్రాన్ తొలి వర్ధంతి సందర్భంగా ఆయన భార్య సుపాత సిక్దర్ ఎమోషనల్ పోస్టు చేశారు. ఆమె చేసి పోస్టు ఇప్పుడు అందరి చేత కంటతడి పెట్టిస్తుంది.
తన భర్త ఇమ్రాన్ ఖాన్ను తలుచుకుంటూ సిక్దర్ చేసిన పోస్ట్ ఎమోషనల్ గా ఉంది. ఇర్ఫాన్ లేని జీవితం ఎంత బాధాకరంగా ఉందో చెప్పుకొచ్చింది. తనకు కానీ, తన భర్త ఇర్ఫాన్కు కానీ ఎక్కువ మంది స్నేహితులు లేరని.. అందుకే తమకు ఏమాత్రం ఖాళీ దొరికినా ఒకరితో ఒకరు గడిపేవాళ్లమని గుర్తు చేసుకుంది. ఇర్ఫాన్ చాలా సమయం షూటింగ్లకే కేటాయించినా.. అందులోంచి ఖాళీ అవ్వగానే తనతోనే గడిపేవాడని చెప్పుకొచ్చింది. పిల్లలతో కూడా కావాల్సినంత టైమ్ గడిపేవాడని చెప్పింది.
అందుకే అతను లేని జీవితం చాలా భారంగా గడుస్తుందని సుపాతా బాధ పడింది. అంతేకాదు ఇర్ఫాన్ చనిపోవడానికి రెండు నెలల ముందు తాము హాలిడే ప్లాన్ చేసుకున్నామని చెప్పుకొచ్చింది సుపాత. అయితే ఆయన ఎప్పుడైనా చనిపోయే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పిన తర్వాత కూడా బయటికి వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నామని చెప్పింది. కానీ అంతలోనే ఆయన చనిపోయాడని చెప్పింది సుపాత. ఆయన భౌతికంగా లేకపోయినా కూడా తన చుట్టూనే ఉన్నట్లు అనిపిస్తుందని చెప్పింది ఇర్ఫాన్ భార్య సుపాత సిక్దర్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!
ఓటీటీలో ఏ1 ఎక్స్ప్రెస్ సందడి ఎప్పుడంటే..?
ప్రియాంక వల్లే అవకాశాలు రాలేదు: మీరాచోప్రా
బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్కు బెదిరింపులు.. చంపేస్తామంటూ వార్నింగ్
సమంతతో సెల్ఫీ..మేకర్స్ బర్త్ డే విషెస్
శర్వానంద్ ‘ది లైఫ్ ఆఫ్ రామ్’ అరుదైన ర…
‘బాహుబలి 2’ సినిమాకు నాలుగేళ్ళు పూర్తి.. 450 కోట్ల…
సోనాల్ చౌహాన్ హాట్ సెల్ఫీ..ఫొటో వైరల్
ఆర్ఆర్ఆర్ యాక్టర్ ఔదార్యం..కోవిడ్ కేర్ ఏర్పాటు