వరంగల్ అర్బన్ : కరోనా నివారణ కోసం మే 1వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాలు పైబడిన వారందరికి ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
హన్మకొండ పోచమ్మ కుంట అర్బన్ హెల్త్ సెంటర్లో నిర్వహిస్తున్న కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను గురువారం ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచిడి వచ్చే టీకాల సంగతి ఎలా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో టీకాలను సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టిందని ఆయన తెలిపారు.
ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ వేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకమని మంత్రి తెలిపారు.
వరంగల్ అర్బన్ జిల్లా వ్యాక్సినేషన్ కోసం ఏర్పాటు చేసిన 58 కేంద్రాల ద్వారా నిన్నటి వరకు లక్షా 82 వేల 507 మందికి వ్యాక్సిన్ ఇచ్చామని మంత్రి తెలిపారు.
ప్రజలు ఏ విదమైన భయభ్రాంతులకు గురికావొద్దు. కరోనా సోకిన వారికి చికిత్స కోసం కావాల్సిన పడకలు, మందులు, ఆక్సిజన్కు కొరత లేదని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కరోనా ఉధృతిపై వరంగల్లో మంత్రుల సమీక్ష
మానవత్వాన్ని చాటుకున్న సూపర్ స్టార్..!
సమన్వయంతో పని చేద్దాం..కరోనాను తరిమేద్దాం
ఇండియాకు ఆక్సిజన్ కోసం ఓవర్టైమ్ పని చేస్తున్నాం: చైనా
కరోనా టీకా రెండో డోసు తీసుకున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి