కోల్సిటీ, ఏప్రిల్ 27: శ్రీ హనుమాన్ జయంతి పురస్కరించుకొని రామగుండం 13వ డివిజన్ విఠల్ నగర్లోని అభయాంజనేయ స్వామి ఆలయంలో కార్పొరేటర్ రాకం లతా దామోదర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కరోనా నుంచి త్వరితగతిన కోలుకొనేలా శక్తిని ప్రసాదించి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ ఆవరణలో హనుమాన్ జెం డాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు రాకం దామోదర్, బొడ్డు రవీందర్, హనుమాన్ మాల దీక్షాపరులు ఉన్నారు.
మంథని టౌన్, ఏప్రిల్ 27: కరోనా ప్రభావం అధికంగా ఉండడంతో పట్టణంలోని పలు హనుమాన్ ఆలయాల్లో నిరాడంబరంగా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆలయాలను వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించారు. అర్చకులు ఉదయాన్నే హనుమాన్ విగ్రహాలకు పంచామృతాలు, పండ్ల రసాలు, పవిత్ర గో దావరి జలాలతో అభిషేకాలు చేశారు. సింధూరం పూసి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి, సహస్రనామార్చనలు చేశారు. తమ్మి చెరువు ఒడ్డు న ఉన్న శ్రీశక్తి హనుమాన్ ఆలయంలో స్వామి వారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
కాలినడకన కొండగట్టుకు..
పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 27: పెద్దపల్లి మండలం రంగాపూర్, అందుగులపల్లి నుంచి హనుమాన్ మాలధారులు కొండగట్టుకు కాలినడకన బయలుదేరారు. కాలినడకన వస్తామని మొక్కుకున్న స్వాములు కిరణ్, సంతోష్, కిరణ్ ఇరుముడితో కొండగట్టుకు పాదయాత్ర ద్వారా పయనమయ్యారు.
పెద్దపల్లి మండలం రాఘవాపూర్, రంగాపూర్, హన్మంతునిపేట, మారేడుగొండ, గుర్రాంపల్లి, రాగినేడు, పెద్దకల్వల, బ్రాహ్మణపల్లితో పాటు పలు గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయాలు, ప్రధాన ఆలయాలన్నీ జైబోలో హనుమాన్ జై శ్రీరామ్ నామస్మరణలతో మార్మోగాయి.
సుల్తానాబాద్ రూరల్, ఏప్రిల్ 27: సుల్తానాబాద్ మండలం కొదురుపాకలో ఆలయ ప్రధాన పూజారి ఆధ్వర్యంలో గ్రామస్తులు ప్రత్యేక పూజ లు చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆంజనేయస్వామి మాలధారుల భజనలు, జైశ్రీరామ్ నినాదాలతో ప్రాంగణమంతా మార్మోగింది.