ఏఎంసీ, పీఏసీఎస్ చైర్మన్లు రవీందర్రెడ్డి, దేవదాస్, ఎంపీపీ రేణుక
గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 27: రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని సిరిసిల్ల ఏఎంసీ చైర్మన్ సింగిరెడ్డి రవీందర్రెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్ల పీఏసీఎస్ ఆధ్వర్యంలో రగుడులో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని చైర్మన్ బండి దేవదాస్గౌడ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ వొజ్జల అగ్గి రాములు, కౌన్సిలర్ పోచవేని సత్యతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. రైతులు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. ఇక్కడ ఏఎంసీ డైరెక్టర్ బూర నరేశ్, పోచవేని ఎల్ల య్య యాదవ్, ఇటిక్యాల నారాయణ, మాస రాము లు, సందవేని శ్రీనివాస్, గుగ్గిళ్ల అజయ్గౌడ్, సాయికిరణ్ యాదవ్, గుగ్గిళ్ల బాలరాజు, బాలమల్లు, బుర్ర అంజయ్య, ముత్తయ్య ఉన్నారు.
ఆపత్కాలంలోనూ కేంద్రాలు
రైతుల సంక్షేమమే కేసీఆర్ సర్కార్ ఆపత్కాలంలోనూ కొనగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని సిరిసిల్ల పీఏసీఎస్ చైర్మన్ బండి దేవదాస్ పేర్కొన్నారు. కస్బెకట్కూర్, చింతలపల్లిలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వైస్ ఎంపీపీ జంగిటి అంజయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వల్లకొండ వేణుగోపాలరావుతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. రైతులు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ఇక్కడ పీఏసీఎస్ డైరెక్టర్లు బండి దేవందర్ యాదవ్, లక్ష్మి, ఉప సర్పంచ్ రాములు, తిరుపతి, కిషన్, శ్రీను ఉన్నారు.
రైతు సంక్షేమానికి పెద్దపీట
ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 26: రైతు సంక్షేమానికి ప్రభత్వం పెద్దపీట వేస్తున్నదని ఎంపీపీ పిల్లి రేణుక పేర్కొన్నారు. మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్ కృష్ణారెడ్డితో కలిసి మంగళవారం ఆమె ప్రారంభించారు. రైతుకు వెన్నుదన్నుగా ఉండేందకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇక్కడ టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య, ఏఎంసీ చైర్మన్ కొండ రమేశ్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి, సర్పంచ్ నేవూరి వెంకట్రెడ్డి, ఎంపీటీసీ ఎన్గందుల అనసూయ, ఉప సర్పంచ్ ఒగ్గు రజిత, నాయకులు నేవూరి వెంకటనర్సింహారెడ్డి, వైస్ ఎంపీపీ కదిరె భాస్కర్, ఎడ్ల లక్ష్మణ్, అప్సరున్నీసా, దొనుకుల రామచంద్రం, బండారి బాల్రెడ్డి ఎడ్ల రాజ్కుమార్, పంతులూరి వాణి ఉన్నారు.