నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 27: నిజామాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న హనుమాన్ ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం నిరాడంబరంగా నిర్వహించారు. ఆలయ అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మ ధ్య అభిషేకం, అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ మాలధారులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సారంగాపూర్ హనుమాన్ మందిరంలో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి పూజలు చేసేవారు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా భక్తుల సందడి కనిపించలేదు.
ధర్పల్లిలో..
ధర్పల్లి, ఏప్రిల్ 27: మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామా ల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలు మంగళవారం నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఆలయాల్లో భక్తు ల సందడి లేకుండా పరిమిత సంఖ్యలో హనుమాన్ మాలధారులు జయంతిని నిర్వహించారు. మండల కేంద్రంలోని ఆలయంలో మాలధారులు హనుమాన్ జయంతిని కొవిడ్ నిబంధనలతో నిర్వహించారు.
కోటగిరిలో..
కోటగిరి, ఏప్రిల్ 27: మండలంలో హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకొన్నారు. సుంకిని, పొతంగల్, కోటగిరితోపాటు ఆయా గ్రామాల్లోని హనుమాన్ మందిరాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ మాలధారులు పూజలు చేసి ప్రసాదాలు పంచారు. కరోనా నిబంధనల మేరకు కార్యక్రమాలు నిర్వహించారు.
ఆర్మూర్లో..
ఆర్మూర్, ఏప్రిల్ 27: ఆర్మూర్ పట్టణంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో హనుమాన్ జయంతిని ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీల ప్రతినిధులు నిర్వహించారు. మామిడిపల్లిలోని హనుమాన్ మందిరంలో మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత హనుమాన్ మాలధారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జంబి హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు ఉయ్యాల సేవ నిర్వహించారు. నవనాథ సిద్ధులగుట్టపై ఉన్న హనుమాన్ మందిరంలో ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ లింగం, ఈవో శ్రీధర్రావు, ప్రధాన అర్చకుడు నర్సింగ్రావు, డైరెక్టర్లు ప్రకాశ్గౌడ్, లక్ష్మణ్, నడ్పి భోజన్న, గోపి, యమునమ్మ, కౌన్సిలర్ సంగీత, శేఖర్, మాలధారులు పాల్గొన్నారు.
గోల్హనుమాన్ ఆలయంలో పూజలు
ఇందూరు, ఏప్రిల్ 27: జిల్లా కేంద్రంలోని గోల్హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతిని కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించామని ఆలయ ఈవో వేణు, కార్యదర్శి ఆంజనేయులు తెలిపారు. జయంతిలో ఎండోమెంట్ సహాయ కమిషనర్ సోమయ్య పాల్గొన్నారని తెలిపారు. కొద్దిమంది ఆలయ సిబ్బందితో మాత్రమే జయంతిని నిర్వహించామని తెలిపారు. ఉదయం హనుమాన్ చాలీసా, దండకం పఠించి, ప్రత్యేక పూజలు చేశామని తెలిపారు.
బోధన్లో..
శక్కర్నగర్, ఏప్రిల్ 27: బోధన్ పట్టణంలోని మారుతీ మం దిరంలో హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా మంగళవారం తెల్లవారు జామునుంచే అర్చకులు ప్రవీణ్శర్మ వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు, అభిషేకాలు కొనసాగించారు. ఆలయ ప్రాంగణంలో హో మం నిర్వహించారు. కొవిడ్ నిబంధనల మేరకు భక్తులను ఆలయ గర్భగుడిలోకి రాకుండా చర్యలు చేపట్టారు. వేడుకలకు హాజరైన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సోమయ్యను ఆలయ కమిటీ తరఫున సన్మానించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు నాగన్పల్లి మధు, ఆలయ అర్చకుడు శివకుమార్, జూనియర్ అసిస్టెంట్ రాములు తదితరులు పాల్గొన్నారు.
వేల్పూర్లో..
వేల్పూర్, ఏప్రిల్ 27: మండలంలోని ఆయా గ్రామాల్లో హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించుకున్నారు. వేల్పూర్లోని బీసీ కాలనీలో ఉన్న హనుమాన్ ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన 13 ఫీట్ల హనుమాన్ విగ్రహాన్ని ప్రారంభించారు. గ్రామానికి చెందిన కిషన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు.