జమ్ము: జమ్ముకశ్మీర్ రాష్ట్రం రాంబన్ జిల్లా బనిహాల్ ఏరియాలోని ఆర్మీ ట్రాన్సిట్ క్యాంప్లో దారుణం జరిగింది. అసంగప్ప మేడార్ (28) అనే జవాన్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నదని ఆర్మీ అధికారులు తెలిపారు. అసంగప్ప మేడార్ కర్ణాటకకు చెందిన యువకుడిగా గుర్తించినట్లు చెప్పారు. ఘటనకు సబంధించిన మరిన్ని వివరాలతోపాటు, ఆత్మహత్యకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉందన్నారు.