న్యూఢిల్లీ: టీమ్ఇండియా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి తల్లి చెలువాంబ దేవి కరోనా వైరస్ కారణంగా కన్నుమూశారు. ఈ విషయాన్ని వేద శనివారం తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ‘మా అమ్మను కోల్పోయి బాధలో నన్ను ఓదార్చేందుకు సానుభూతి ప్రకటించిన అందరికీ ధన్యవాదాలు. అమ్మ లేకుండా మా కుటుంబాన్ని ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మా సోదరి కోసం ప్రార్థిస్తున్నాం. కరోనా వైరస్ కారణంగా నాలాగా ఆత్మీయులను కోల్పోయిన వారికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని వేద ట్వీట్ చేసింది.