కరోనా పాజిటివ్ వచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సహా పాలకులు, రాష్ట్ర ప్రజలు క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యుడు, వేద పండితుడు జోషి గోపాల శర్మ యాగం నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, ప్రజలంతా ఆందోళనలకు గురవుతున్న పరిస్థితులు, కరోనా భయానక కాలం సమసిపోవాలని వేద పండితుడు జోషి గోపాల శర్మ ఆధ్వర్యంలో యాగం చేపట్టారు. మూడు రోజులపాటు నిర్వహించనున్న పాశుపత మహా మృత్యుంజయ యాగాన్ని గురువారం నాగోలు ఆప్కో కాలనీలోని గాయత్రి శంకర వేద పాఠశాలలో ప్రారంభించారు.