ప్రతి గింజనూ కొంటాం
రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్
వివిధ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ప్రారంభం
హుజూరాబాద్ రూరల్/ ఇల్లందకుంట/ జమ్మికుంట రూరల్, ఏప్రిల్ 21: రైతులు వరి ధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. బుధవారం హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి, రంగాపూర్, ఇల్లందకుంట మండల కేంద్రంతోపాటు సీతంపేట, రాచపల్లి, జమ్మికుంట మండలం వావిలాల, మాచనపల్లి గ్రామాల్లో సింగిల్ విండో, పీఏసీఎస్, ఐకేపీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మాట్లాడుతూ, యాసంగిలో నియోజకవర్గంలో మంచి దిగుబడి వచ్చి రైతులు సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. ధాన్యాన్ని ఆరబెట్టుకొని కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఆందోళన పడవద్దని భరోసా ఇచ్చారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెనువెంటనే మిల్లులకు తరలించాలని, వారం రోజుల్లోనే రైతు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయాలని అధికారులు, కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. అలాగే ఇల్లందకుంట మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో రూ. 5లక్షలతో నిర్మించిన గోదాంను మంత్రి ప్రారంభించారు. జమ్మికుంట మండలం వావిలాల పీహెచ్సీకి వెళ్లి వ్యాక్సినేషన్ను పరిశీలించారు. అదే గ్రామంలోని శ్రీసీతారామాంజనేయ ఆలయాన్ని సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్ విజయ, ఎంపీపీలు ఇరుమల్ల రాణి, పావని, మమత, జమ్మికుంట జడ్పీటీసీ శ్రీరాంశ్యామ్, పీఏసీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పింగిళి రమేశ్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వాల బాలకిషన్రావు, సింగిల్ విండో చైర్మన్లు కౌరు సుగుణాకర్రెడ్డి, కొండల్రెడ్డి, ఇల్లందకుంట పీఏసీఎస్ ఉపాధ్యక్షుడు కందాల కొమురెల్లి, ఏవో గుర్రం రజిత, తహసీల్దార్ సురేఖ, రైతుబంధు మండల కో-ఆర్డినేటర్ నారాయణ, సర్పంచులు ప్రతాప్రెడ్డి, ఎల్లయ్య, కరుణాకర్, శ్రీలత, వెంకటస్వామి, అరుణ, ఆదిలక్ష్మి, కల్పన, పీఏసీఎస్ సీఈవో ఆదిత్య, టీఆర్ఎస్ నాయకులు, వార్డు సభ్యులు, సింగిల్ విండో డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.