అమరావతి : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. కడప జిల్లాలో జర్నలిస్టు కుటుంబాన్ని కరోనా కబలించింది.
వైరస్ బారినపడిన జర్నలిస్టు ప్రభాకర్ రెడ్డి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందాడు. 24 గంటలు గడవక ముందే ప్రభాకర్ రెడ్డి తండ్రి ఓబుల్ రెడ్డి సైతం కరోనా కాటుకు బలయ్యాడు.
గంటల వ్యవధిలో తండ్రి, కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి