కోల్ కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఐదో దశ పోలింగ్ లో బుధవారం కమర్హాటీ పోలింగ్ బూత్ నెంబర్ 107లో బీజేపీ ఏజెంట్ మరణించారు. ఏజెంట్ ఆకస్మిక మరణంపై ఈసీ నివేదిక కోరింది. ఏజెంట్ గా కూర్చున్న అభిజిత్ సామంత్ తీవ్ర అస్వస్థతకు లోనైనా ఎవరూ పట్టించుకోలేదని, తక్షణ చికిత్సకు అక్కడ ఎలాంటి సదుపాయం లేదని బాదితుడి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతన్నా బెంగాల్ లో ఐదో దశ పోలింగ్ కు ఓటర్లు పోటెత్తారు. ఈ దశలో జల్పాయిగురి, కలింపాంగ్, డార్జలింగ్, నదియా, పర్బా వర్ధమాన్, ఉత్తర 24 పరగణాల జిల్లాల్లోని 45 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో పాలక టీఎంసీ, బీజేపీలు ముఖాముఖి తలపడుతున్నాయి.