ముంబై: ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది పంజాబ్ కింగ్స్. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డకౌటయ్యాడు. దీపక్ చహర్ బౌలింగ్లో అతడు క్లీన్బౌల్డ్ అయ్యాడు. దీంతో ఒక పరుగుకే పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో చెన్నై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. అదే ఓవర్ చివరి బంతికి క్రిస్ గేల్ కూడా ఔటయ్యేవాడే. అయితే గైక్వాడ్ క్యాచ్ డ్రాప్ చేయడంతో అతడు బతికిపోయాడు.