ముంబై : నావీ ముంబై పరిధిలోని వైశాలి రైల్వే స్టేషన్ సమీపంలోని రియల్ టెక్ పార్క్ భవనంలో ప్రమాదవశాత్తు ఆదివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. 14 అంతస్తులో మంటలు దావానంలా వ్యాపించి పొగలు కమ్ముకున్నాయి.
భవనంలోని వారు అప్రమత్తమై మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆస్తినష్టంపై ఇప్పుడే స్పష్టమైన అంచనాకు రాలేకపోతున్నామని అధికారులు తెలిపారు.
అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు తెలియరాలేదు. విద్యుత్ షార్ట్సర్క్యూటే కారణం కావచ్చని భావిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి