ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ అభిమానులకు పండగే ! పదమూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ పొట్టి క్రికెట్కు ఇప్పటికీ ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు !! కరోనా మహమ్మారి విజృంభణ కాలంలో కూడా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్లను నిర్వహిస్తున్నారంటే.. ఐపీఎల్ అంటే క్రికెట్ అభిమానుల్లో ఎంత క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. జనాల్లో ఐపీఎల్ అంటే ఇంత అభిమానం ఉంది కాబట్టే.. ఫ్రాంఛైజీలు కోట్లకు కోట్లు పెట్టి మరీ ఆటగాళ్లను కొనుగోలు చేస్తుంది. వాళ్లపై ఎంతో పెట్టుబడి పెడుతుంది. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ ఐపీఎల్ నిర్వహణకు డబ్బులు ఎలా వస్తున్నాయి? స్టేడియాలు అద్దెకు తీసుకుని మ్యాచ్లు జరపాలన్నా.. ఆటగాళ్లను కొనాలన్నా ఫ్రాంచైజీలకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? అనే విషయాలు తెలుసా!
ఐపీఎల్లో మీడియా హక్కుల ద్వారానే అత్యధిక ఆదాయం వస్తుంది. ఐపీఎల్ నిర్వహణలో వచ్చే ఆదాయం మొత్తంలో 60 నుంచి 70 శాతం ఆదాయం మీడియా హక్కుల ద్వారానే వస్తాయి. 2018 నుంచి 2022 వరకు ఐపీఎల్ మ్యాచ్ల బ్రాడ్ కాస్టింగ్ హక్కులను రూ.16,347 కోట్ల రూపాయలకు స్టార్ స్పోర్ట్స్ దక్కించుకుంది. అంటే బీసీసీఐకి ప్రతి ఏడాది స్టార్ స్పోర్ట్స్ ద్వారా రూ.3,270 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ వచ్చిన ఆదాయాన్ని 50 శాతం బీసీసీఐకి, 45 శాతం ఫ్రాంచైజీలకు, 5 శాతం ప్రైజ్ మనీ కింద విభజిస్తారు.
మీడియా హక్కులతో పాటు టైటిల్ స్పాన్సర్షిప్ ద్వారా కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఎక్కువ ఆదాయం వస్తుంది. 2018 నుంచి 2022 వరకు ఐదేళ్ల కోసం టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను రూ.2,199 కోట్లకు చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో దక్కించుకుంది. కానీ 2020లో వివో కంపెనీ తమ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుంది. దీంతో గత సీజన్లో డ్రీమ్ 11 టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించింది. ఇందుకోసం రూ.222కోట్లకు బిడ్ దక్కించుకుంది. ఇవి కాకుండా ప్రతి ఫ్రాంచైజీకి కొంతమంది స్పాన్సర్లు ఉంటారు. ఆటగాళ్లు ధరించే జెర్సీలపై ఆ స్పాన్సర్ల పేర్లు కనిపిస్తుంటాయి. ఇలా తమ కంపెనీలను ప్రమోట్ చేసుకోవడం కోసం స్పాన్సర్లు ఫ్రాంచైజీలతో ఒప్పందం చేసుకుంటారు. ఇలా స్పాన్సర్ల ద్వారా కూడా ఆదాయం వస్తుంది.
కరోనా మహమ్మారి కారణంగా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్లు నిర్వహిస్తున్నారు.. కానీ మాములుగా అయితే ఐపీఎల్ మ్యాచ్ అంటే స్టేడియాలు జనాలతో కళకళలాడేవి. ఈ టికెట్లను అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువ మొత్తం ఫ్రాంచైజీలకే వెళ్తుంది. కొద్ది మొత్తం మాత్రం బీసీసీఐ తీసుకుంటుంది. ఐపీఎల్లో ఒక్కో ఫ్రాంచైజీ తన హోం టౌన్లో 7 మ్యాచ్లు ఆడుతుంది. ఆ మ్యాచ్ టికెట్ల ధరలు నిర్ణయించే అధికారం ఆ ఫ్రాంచైజీకే ఉంటుంది. టికెట్లు అమ్మగా వచ్చిన ఆదాయంలో ఎక్కువ మొత్తం కూడా వాళ్లకే వస్తుంది. బీసీసీఐ, స్పాన్సర్లకు కొద్ది వాటా వెళ్తుంది. సాధారణంగా గేట్ రెవెన్యూ ద్వారా ఫ్రాంచైజీలకు ఏటా రూ.15కోట్ల నుంచి 25 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది.
ప్రైజ్ మనీ ద్వారా కూడా ఫ్రాంచైజీలు ఆదాయాన్ని పొందుతాయి. సాధారణంగా ప్రతి సీజన్లోనూ టైటిల్ గెలిచిన జట్టుకు రూ.20 కోట్లు, రన్నరప్గా నిలిచిన జట్టుకు రూ.12.5 కోట్ల ప్రైజ్ మనీ అందుతుంది. కానీ కరోనా నేపథ్యంలో ఈ ప్రైజ్ మనీని బీసీసీఐ సగానికి తగ్గించింది.
ఆటగాళ్లను మార్చుకోవడం, తమ బ్రాండ్ టీషర్టులు, క్యాప్లు, ఇతర ఆట వస్తువులను విక్రయించడం ద్వారా కూడా ఫ్రాంచైజీలు ఆదాయం పొందుతాయి.
ఆదాయంతో పాటు ఖర్చు కూడా ఫ్రాంచైజీలకు ఎక్కువే ఉంటుంది. ఓనర్ షిప్ కోసం కోసం ఫ్రాంచైజీలు బీసీసీఐకి భారీగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మ్యాచ్ నిర్వహణ, ఆటగాళ్ల జీతాలు, ఇతర ఖర్చుల కోసం తమకు వచ్చే ఆదాయంలో 35 నుంచి 45 శాతం వరకు ఫ్రాంచైజీలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పీఎల్ 2021: జేసన్ రాయ్ వచ్చేశాడు!
1079 రోజుల తర్వాత ఫస్ట్ సిక్స్ కొట్టిన మాక్స్వెల్
ఐపీఎల్ 2021: మాస్టర్ vs స్టూడెంట్
ప్రపంచకప్నకు ఆతిథ్యమిస్తాం:సౌరవ్ గంగూలీ