చెన్నై: ఐపీఎల్ తొలి మ్యాచ్లో రోహిత్ శర్మ విఫలమయ్యాడు. మంచి టచ్లో కనిపించిన సమయంలో రనౌటయ్యాడు. లేని పరుగు కోసం ప్రయత్నించి అతడు అవుట్ అయ్యాడు. 15 బంతుల్లో 1 సిక్స్, 1 ఫోర్తో 19 పరుగులు చేశాడు రోహిత్. ఆర్సీబీ కెప్టెన్ మెరుపు ఫీల్డింగ్తో ముంబై కెప్టెన్ను అవుట్ చేయడం విశేషం. పవర్ ప్లే ముగిసే సమయానికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది.