నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 5 : స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ జయంతిని జిల్లావ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
బీర్కూర్లో బాబూ జగ్జీవన్రామ్ విగ్రహానికి డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాబూ జగ్జీవన్రామ్ దేశంలోని దళిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషిచేశారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘు, జడ్పీటీసీ స్వరూప, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, వైస్ ఎంపీపీ కాశీరాం, ఎంపీటీసీ సందీప్పటేల్, తహసీల్దార్ గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో బల్దియా చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, బీజేపీ జిల్లా కార్యాలయంలో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఏబీవీపీ కార్యాలయంలో జిల్లా ప్రముఖ్ గిరి ఆధ్వర్యంలో జగ్జీవన్రామ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో బల్దియా వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, కమిషనర్ దేవేందర్, కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు, ఏబీవీపీ జిల్లా కన్వీనర్ భానుప్రసాద్ పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి పట్టణంలోని 12వ వార్డులో ఉన్న జగ్జీవన్రామ్ విగ్రహానికి టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎల్లారెడ్డి టీఆర్ఎస్ మాజీ పట్టణాధ్యక్షుడు మంచిర్యాల విద్యాసాగర్, మాజీ జడ్పీటీసీ సామెల్, ఎల్లారెడ్డి సొసైటీ మాజీ చైర్మన్ బోండ్ల సాయిలు, ఎమ్మార్పీఎస్ నాయకుడు కంతి పద్మారావు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట్ తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ సయ్యద్ అహ్మద్, సదాశివనగర్ మండలం భూంపల్లిలో మాజీ జడ్పీటీసీ పడిగెల రాజేశ్వర్ రావు, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు గైని శ్రీకాంత్ జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో భూంపల్లి ఉపసర్పంచ్ సాయిలు, మాజీ ఎంపీపీ గైని నగేశ్, బీడీఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ భాస్కర్, మాజీ సర్పంచ్ రవీందర్ గౌడ్, అంబరీశుని ఆలయ కమిటీ అధ్యక్షుడు సంగెం రాజిరెడ్డి పాల్గొన్నారు.
నస్రుల్లాబాద్ మండలకేంద్రంతోపాటు నెమ్లి, నస్రుల్లాబాద్, మిర్జాపూర్, దుర్కి గ్రామాల్లో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో విండో చైర్మన్ మారుతి, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పెంటయ్య, ఉల్లెంగ సాయిలు, టీఆర్ఎస్ నాయకులు గంగారాం, పురం వెంకటి పాల్గొన్నారు.
పిట్లం మండలకేంద్రంలోని ఎస్సీ కమిటీ భవనంలో టీఆర్ఎస్ నాయకుడు నర్సాగౌడ్ ఆధ్వర్యంలో జగ్జీవన్రామ్ జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు సాయిలు, వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు సాయిలు పాల్గొన్నారు. రామారెడ్డిలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జగ్జీవన్రామ్ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నరేశ్, ఉపాధ్యక్షుడు సుమన్, హన్మాండ్లు, రామారెడ్డి ప్రభుత్వ దవాఖాన సిబ్బంది భీమ్, జ్యోతి, శ్రీహరి, ఆశవర్కర్ భూదేవి పాల్గొన్నారు.
బీబీపేట్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో జగ్జీవన్రామ్ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, బీఎస్పీ జిల్లా కార్యదర్శి, స్వేరోస్ మండల అధ్యక్షుడు దుబ్బాక శ్రీనివాస్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం వర్కింగ్ అధ్యక్షుడు దిలీప్, బహుజన సేవా సంఘం మండల అధ్యక్షుడు బాబు, గౌరవ అధ్యక్షుడు పాత బాబు, ఉపాధ్యక్షుడు రాజు తదితరులు పాల్గొన్నారు.
మాచారెడ్డి మండలంలోని మంథనిదేవునిపల్లి, ఫరీద్పేట, మాచారెడ్డి గ్రామాల్లో జగ్జీవన్రామ్ జయంతిని ఎమ్మార్పీఎస్, ఏబీవీపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. మంథనిదేవునిపల్లి సర్పంచ్ కొత్త అరవింద్, బట్ట వెంకట్రాములు, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సరళ, ఎంపీటీసీ శ్రావణి ఆధ్వర్యంలో, దేశాయిపేట్లో మోచి సంఘం ఆధ్వర్యంలో జగ్జీవన్రామ్ జయంతిని నిర్వహించారు. మోచి సంఘం జిల్లా అధ్యక్షుడు మోచి గణేశ్, జిల్లా అధికార ప్రతినిధి అంబిల్పురి రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
విస్తృతంగా కరోనా పరీక్షలు, కొవిడ్ వ్యాక్సినేషన్