సిద్దిపేట: అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని, దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. దళితుల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారన్నారు. దేశ తొలి ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సిద్దిపేటలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఎస్సీ ఎంపవర్మెంట్ స్కీమ్ కింద బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పపర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..