సాగుకు ఇబ్బంది లేకుండాఎస్సారెస్పీ నీటి సరఫరా
పంట చేతికి వస్తున్న సంబురంలో రైతులు
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
ఓదెల, ఏప్రిల్ 4: యాసంగి వరి కోతలు కొన్ని చోట్ల ముందస్తుగానే ప్రారంభమయ్యా యి. కొనుగోలు కేంద్రాలకు ఇప్పుడిప్పుడే ధా న్యం రాశులు చేరుతున్నాయి. పుష్కలంగా జలాలు, సకాలంలో కరెంట్ సరఫరా కావడం తో అనుకున్న స్థాయిలో పంటలు చేతికి వస్తు న్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ రైతులకు అనేక సంక్షేమ పథకాలు అమ లు చేస్తున్నారు. సాగు నీటికి ఇబ్బందులు లేకుం డా కాళేశ్వరం జలాల ద్వారా పంటలకు నీళ్లు అందిస్తున్నారు. ఈ యాసంగిలో రైతులు ఏమాత్రం నీళ్లకు ఇబ్బంది పడలేదు. చెరువులు, కుంటలు ఎండాకాలంలో కూడా నిండుకుండను తలపిస్తూ కొన్ని మత్తడులు కూడా పడుతున్నాయి. 24 గంటలపాటు ఉచితంగా కరెంట్ సరఫరా అవుతుండడంతో రైతులు ముందస్తుగా పంటలు వేసి కోస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో నాట్లు వేసిన రైతుల పొలాలు కోతకు వచ్చాయి. దీంతో కోయిస్తున్నారు. పంటలు ఆశించిన విధంగా ఉండడంతో ఎకరాకు 28 నుంచి 30 క్వింటాళ్ల దాకా ధాన్యం వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోళ్లకు ఏర్పాట్లు..
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లకు ఆంక్షలు విధించినా తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతున్నది. జిల్లాలో సెర్ప్ ఆధ్వర్యంలో 61, సహకార సంఘాలు, డీసీఎంఎస్ ద్వారా 230 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. గతేడాది సెర్ప్ ఆధ్వర్యంలో నడిచిన కొనుగోలు కేంద్రాల ద్వారా 7,73,671 క్వింటాళ్ల ధాన్యం, 12,883 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. అలాగే సహకార సంఘాలు, డీసీఎంఎస్ ద్వారా 27, 43,730 క్వింటాళ్ల ధాన్యం 41,021 రైతుల వద్ద కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం కూడా అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లను చేస్తున్నది.
ఇవి కూడా చూడండి..
మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ