ముంబై, ఏప్రిల్ 3: బజాజ్కు చెందిన ప్రీమియం బైకుల విక్రయ సంస్థ కేటీఎం తన వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. తయారీ ఖర్చులు పెరుగడంతో ధరలను పెంచాల్సి వచ్చిందని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో కేటీఎం, హుస్కావర్ణ బైకులు రూ.10 వేల వరకు ప్రియం కానున్నాయి. వివిధ మోడళ్ళను బట్టి ధరల పెరుగుదలలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. దీంట్లో కేటీఎం బైకులు రూ.8,812 వరకు అధికమవనుండగా, హుస్కవర్ణ బైకులు రూ.9,730 వరకు పెరిగాయి. కేటీఎం బైకులు రూ.1,60,319 నుంచి రూ.1,83,328 ధరల శ్రేణిలో లభించనున్నాయి.
ఇవి కూడా చదవండి :
నూతన ఆవిష్కరణల కోసం జీఎమ్మార్ ఇన్నోవెక్స్