సిద్దిపేట జోన్, మార్చి 27 :సిద్దిపేట కరీంనగర్ బైపాస్రోడ్డులో ఉన్న నర్సపురం జంక్షన్ అభివృద్ధికి, సుందరీకరణకు రూ.4కోట్లు, నర్సపురం జంక్షన్ నుంచి రంగీలా దాబా చౌరస్తా వరకు సర్వీసు రోడ్డు నిర్మాణానికి రూ.10కోట్లు మంజూరైన ట్లు మంత్రి హరీశ్రావు శనివారం తెలిపారు. సిద్దిపేట కరీంనగర్ బైపాస్ రో డ్డులో ఉన్న నర్సపురం కూడలి వద్ద సర్కిల్ అభివృద్ధి, జంక్షన్ లేకపోవడంతో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని నర్సపురం జంక్షన్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని జంక్షన్లను ఏ విధంగా అభివృద్ధి చేశామో అదే విధంగా నర్సపురం జంక్షన్ను అద్భుతంగా సుందరీకరిస్తున్నట్లు తెలిపారు. నర్సపురం జంక్షన్ నుంచి రంగీలా దాబా వరకు కుడి వైపున 2కి.మీ దూరం సర్వీసు రోడ్డును నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ సర్వీసు రోడ్డు నిర్మాణంతో డబుల్ బెడ్రూం ఇండ్లలో ఉండే ప్రజలకు ప్రయాణం సులభతరమవుతుందని మంత్రి తెలిపారు.
సిద్దిపేట కరీంనగర్ బైపాస్కు కొత్త అందం..
పట్టణంలోని నర్సపురం చౌరస్తా నుంచి బైపాస్ మీదుగా నర్సపురం వెళ్లేటప్పుడు ఏ వైపు నుంచి ఏ వాహనం వస్తుందో తెలియని పరిస్థితి. ఇక్కడ సర్కిల్ ఉందా లేదా అనే విధంగా ఉండడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిని నివారించేందుకు మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో జంక్షన్ అభివృద్ధికి రూ.4కోట్లు మంజూరు చేయించారు. ఈ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
కేసీఆర్ కాలనీ ప్రజలకు ప్రయాణం సులభతరం..
సిద్దిపేట కరీంనగర్ బైపాస్ రోడ్డులో నర్సపురం చౌరస్తా నుంచి రంగీలా దాబా వరకు 2కి.మీ దూరం రోడ్డు నిర్మాణానికి రూ.10కోట్లు మంజూరు కావడంతో ప్రజలు డబుల్బెడ్రూం ఇండ్లలోకి వెళ్లేందుకు ప్రయాణం సులభతరం కానున్నది. ఇటీవల ప్రారంభించుకున్న కేసీఆర్నగర్ డబుడ్ బెడ్రూం ఇండ్లలోని వెళ్లాలంటే అటు రంగీలా దాబా వైపు నుంచి, లేదా ఇటు నర్సపురం చౌరస్తావైపు నుంచి వెళ్లాలి. దీంతో ప్రజలకు ఇబ్బందులు పడేవారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని నర్సపురం చౌరస్తా నుంచి రంగీలా దాబా వరకు 2కి.మీ పొడవునా రోడ్డు నిర్మాణం జరుగనున్నది. ఐరన్ రేలింగ్, ఫుట్పాత్, సకల హంగులతో సర్వీసు రోడ్డు నిర్మాణం జరుగనున్నది.
కొత్త బస్టాండ్ ప్రహరీ తొలిగింపు..
సిద్దిపేట కొత్త బస్టాండ్ సమీపంలోని హరిప్రియనగర్ టీచర్స్ కాలనీ నుంచి వచ్చి పోయే స్కూల్ బస్సులు, చెత్త సేకరణ వాహనాలతో ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ జామై ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో మంత్రి ఆర్టీసీ అధికారులతో సమావేశం నిర్వహించి కొత్త బస్టాండ్కు ఆనుకొని ఉన్న ప్రహరీని తొలిగించి రోడ్డు విస్తరణ చేయాల్సిందిగా రోడ్డు రవాణా సంస్థ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో కొత్త ప్రహరీ తొలిగించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టి కొత్త ప్రహరీ నిర్మించనున్నారు. దీంతో ఆ కాలనీకి వెళ్లే ప్రజలకు, ఇతర వాహనాలకు ఇబ్బందులు తొలగనున్నాయి.
తప్పనున్న ఇరుకుదారి ఇక్కట్లు..
ఎన్నో ఏండ్ల నుంచి ఒక వాహనం వచ్చిందంటే మరొక వాహనానికి దారి లేకుండా ఉందేది. అకస్మాత్తుగా వాహనం వచ్చి మలుపు తిరిగిందంటే ప్రమాదం జరిగే పరిస్థితి. ఈ పరిస్థితిని గమనించిన మంత్రి హరీశ్రావు ఇరుకు దారితో ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించి రోడ్డు విస్తరణకు పనులు చేపడుతున్నట్లు హరిప్రియనగర్ టీచర్స్ కాలనీ ప్రజలకు శుభవార్త చెప్పారు. త్వరలోనే ప్రహరీ తొలగించడంతో పాటు రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు.