సుల్తాన్బజార్, మార్చి 21 : సమష్టి కృషితోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి వాణీదేవి ఘన విజయం సాధించిందని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు ముజీబ్హుస్సేనీ అన్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ విజయఢంకా మోగించడాన్ని హర్షిస్తూ ఆయన శాఖ సభ్యులతో కలిసి హోం మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్లను మర్యాద పూర్వకంగా కలుసుకొని ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీగా వాణీదేవి విజయంలో టీఎన్జీవో విశేషంగా కృషి చేసిందన్నారు. టీఎన్జీవో కేంద్ర సంఘం పిలుపు మేరకు హైదరాబాద్ జిల్లా శాఖ నిరంతరం కృషి చేసి ఉద్యోగులకు తమ ఓటు హక్కును కచ్చితంగా వినియోగించుకోవాలని కోరామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల వ్యవస్థాపక అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, హైదరాబాద్ జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు ఎస్.విక్రమ్కుమార్, కేఆర్ రాజ్కుమార్, ఉమర్ఖాన్, ప్రచార కార్యదర్శి కురాడి శ్రీనివాస్, సభ్యులు ఖాలేద్ అహ్మద్, టి.వెంకటేశ్, బి.శంకర్, మాజీ కార్యదర్శి కె.దేవేందర్, జహంగీర్ పాషా, శ్రీధర్ నాయుడు, నాల్గవ తరగతి కేంద్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎంఏ ముజీబ్, తెలంగాణ డ్రైవర్స్ అసోసియేషన్ కేంద్ర సంఘం కార్యదర్శి ఎండీ.యూసుఫుధ్దీన్,ఉస్మాన్ అలీ ఉస్మానీ పాల్గొన్నారు.
అబిడ్స్, మార్చి 21 : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు విజయం సాధించడంతో సంబురాలు జరుపుకున్నారు. మంగళ్హాట్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నందకిశోర్ వ్యాస్, మంగళ్హాట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పరమేశ్వరిసింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందకిశోర్ వ్యాస్ మాట్లాడుతూ.. వాణీదేవికి పట్టభద్రులు తమ సంపూర్ణ మద్దతు తెలిపి గెలుపించారాన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు వాణీదేవి గెలుపునకు దోహదపడ్డాయన్నారు. మంగళ్హాట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పరమేశ్వరిసింగ్, టీఆర్ఎస్ నాయకులు నందు కుమార్ మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. గోషామహల్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి ప్రేమ్సింగ్ రాథోడ్కు పలువురు నాయకులు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ మాజీ నగర కార్యదర్శి బి. రమేశ్ గుప్తా, వాసుదేవరావు వాణీదేవికి శుభాకాంక్షలు తెలిపారు.