బీబీనగర్, మార్చి21: గొల్ల, కురుమల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఇతోధికంగా కృషి చేస్తున్నారని గొర్రెలు,మేకల పంపకందారుల సంఘం మండల అధ్యక్షుడు సోము రమేశ్ అన్నారు. రెండో విడుత గొర్రెలను పంపిణీ చేసేందుకు బడ్జెట్లో రూ. 3000 కోట్లు కేటాయించడాన్ని హర్షిస్తూ ఆదివారం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పింగళ్రెడ్డి హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో గొల్ల, కురుమ జేఏసీ జిల్లా కన్వీనర్ అయోధ్యయాదవ్, రవి, చంద్రశేకర్, శ్రీశైలం, గోపాల్, బాల్రాజు, శ్రీశైలం, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు