వరంగల్ రూరల్ : పరిమితికి మించి ప్రయాణికులను తీసుకువెళ్తున్న 30 మినీ ట్రక్కులను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో శనివారం చోటుచేసుకుంది. నిబంధనలను అతిక్రమించి త్రీ వీలర్స్ వాహనాలు ప్రయాణికులను తీసుకువెళ్తున్నాయి. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం నేపథ్యంలో పరకాల ప్రాంత పరిధిలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 30 మినీ ట్రక్కులను సీజ్ చేశారు.
పరకాల ఏసీపీ ఏ.శ్రీనివాస్ మాట్లాడుతూ.. నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువగా ప్రయాణికులను తీసుకువెళ్తే కఠిన చర్యలు తప్పవని డ్రైవర్లను, వాహన యజమానులను హెచ్చరించారు. ఓ నెల జైలు శిక్షతో పాటు రూ. 2 లక్షల జరిమానా తప్పదన్నారు. సరుకు రవాణా వాహనాలు ప్రయాణికులను తీసుకువెళ్లేందుకు అనుమతించమన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్త చర్యలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు.