జీపీ ఖాతాలో రూ.10లక్షలు
అయినా ముందుకుసాగని పనులు
ఇంకా పునాదుల్లోనే వైకుంఠధామం..
పూర్తికాని డంపింగ్ యార్డు నిర్మాణం
రోడ్లపై పెంటకుప్పలతో వీధులు అపరిశుభ్రం
గ్రామంలో మొక్కుబడిగా పనులు
నందనాయక్తండాలో కనిపించని ‘ప్రగతి’
గీసుగొండ, మార్చి 13:ఆ ఊరికి నెలనెలా రూ.5లక్షల నిధులు జమవుతున్నా.. గ్రామంలో మాత్రం అభివృద్ధి జాడ కనిపించదు. ‘పల్లె ప్రగతి’తో మండలంలోని అన్ని గ్రామాలు దూసుకెళ్తుం టే.. గీసుగొండ మండలంలోని నందనాయక్తండా ముందుకుసాగడం లేదు. ఇంకా పునాది దశలోనే వైకుంఠధామం, పూర్తికాని డంపింగ్ యార్డు, రోడ్లపై పెంటకుప్పలు, ఫెన్సింగ్లేని నర్సరీ.. ఇలా పనులు నిమ్మలంగా సాగుతున్న తీరు ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
అన్ని గ్రామాలు అభివృద్ధి సాధిస్తుంటే నందనాయక్తండా గ్రామంలో పల్లె ప్రగతి పనులు పునాది దశల్లోనే ఉన్నాయి. ప్రభుత్వం నెలనెలా నిధులు ఇస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగడం లేదు. వైకుంఠధామం పునాది దశలో ఉండగా డంపింగ్ యార్డు నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. అంతేగాక రోడ్లపైనే పెంట కుప్పలు, డ్రైనేజీల నుంచి తీసిన వ్యర్థాలను రోడ్ల పక్కనే వదిలేస్తున్నారు. గ్రామా పంచాయతీ పాలకవర్గం, అధికారుల నిర్లక్ష్యంతో గ్రామంలో పారిశుధ్య పనులు చేయడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇస్తు న్న నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ప్రభుత్వం ఇస్తున్న నిధులతోపాటు కొమ్మాల అంగడి ఆదాయం కూ డా గ్రామ పంచాయతీ ఖాతాలోనే జమవుతాయి. ఎస్ఎఫ్సీ, 14,15వ ఫైనాన్స్ నిధులు ప్రతి నెలా రూ.5లక్షల 35వేల నిధులు జీపీ ఖాతాలో జమవుతున్నాయి. అలాగే అంగడి ఆదాయం మరో రూ.5 లక్షలు కలిపి మొత్తం రూ. 10లక్షల 35వేల ఉన్నా ఉపయోగం లేకుండా పో యింది. డంపింగ్ యార్డు నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. పరిశుభ్రంగా ఉండాల్సిన గ్రామం అపరిశుభ్రంగా మారింది. రోడ్లపైనే పెంటకుప్పలు వేయడం, గ్రామంలో సేకరించిన చెత్త ను డంపింగ్ యార్డు వరకు తరలించకుండా ఆ చెత్తను రోడ్లపక్కకు వేయడంతో దోమలతో పాటు దుర్వాసన వస్తున్నదని తండావాసులు చెబుతున్నారు. అలాగే నర్సరీకి ఎ లాంటి రక్షణ ఏర్పాటు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వదిలేశారు. అంతేగాక సరైన నీటి సదుపాయం అందులో నాటిన మొక్కలు మొ లకెత్తలేదు. నర్సరీ చుట్టూ ఫెన్సింగ్ లేకపోవడంతో పశువులు దానిమీదుగానే వెళ్తున్నాయి.
పాలకవర్గం నిర్లక్ష్యం వల్లే..
వైకుంఠధామం నిర్మించాలని చాలాసార్లు పాలకవర్గానికి చెప్పి నా పట్టించుకోలేదు. ప్రారంభించి సంవత్సరం కావస్తోంది. ఎంపీడీవో సందర్శించి హెచ్చరించినా పనులు చేయడం లేదు. సర్పంచ్కు నోటీసులు కూడా ఇచ్చారు. గ్రామంలో మిగతా పనులు చేయిస్తున్నా. శ్మశానవాటిక పనులు త్వరగా పూర్తయ్యేలా కృషిచేస్తా.