మేడ్చల్ జోన్ బృందం, మార్చి 12 : మేడ్చల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలు శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ బలపర్చిన టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ఆయా మండలాలు, మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ నాయకులు పర్యటించి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని వివరించి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.
సురభి వాణీదేవిని ఎమ్మెల్సీగా గెలిపించాలని మండల టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బి.నాగరాజు కోరారు. ఘట్కేసర్ మండలంలోని కొర్రెములలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టభద్రులను కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మహేంద్రచారి, యువజన విభాగం మండల శాఖ అధ్యక్షుడు బాలు యాదవ్ పాల్గొన్నారు. చౌదరిగూడలో మండల టీఆర్ఎస్ నాయకుడు సందీప్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణీదేవిని గెలిపించాలని పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలో శుక్రవారం టీఆర్ఎస్ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరపాలక పరిధి….24వ డివిజన్లో కార్పొరేటర్ ఎల్లపల్లి అనంతరెడ్డి స్థానిక నాయకులతో కలిసి మారుతీనగర్, ప్రశాంత్నగర్, ఓం విహారికా, సాయినగర్కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డు కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా శామీర్పేట మండలంలో టీఆర్ఎస్ శ్రేణులు ఎన్నికల ప్రచారం చేపట్టారు. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. ఆయా గ్రామాల్లో ఎంపీపీ ఎల్లూబాయిబాబు, జడ్పీటీసీ అనితలాలయ్య, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి తాళ్ల జగదీశ్గౌడ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.
దమ్మాయిగూడ, అహ్మద్గూడ, కుందన్పల్లి, రాజీవ్గృహకల్ప, నాగారం, రాంపల్లిలో టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు చివరి రోజు ఎన్నికల ప్రచారం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు. నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, పార్టీ అధ్యక్షులు తేళ్ల శ్రీధర్, కౌకుట్ల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శులు హరిగౌడ్, శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు, నేతలు పాల్గొన్నారు.