హాస్యంలోనైనా, హీరోయిజాన్ని పండించడంలోనైనా తనకు తానే సాటి అనిపించుకుంటారు సీనియర్ యాక్టర్ రాజేంద్రప్రసాద్. తన సినిమాలతో ప్రేక్షకులను నవ్విస్తూ..నటనతో అందరినీ ఏడిపిస్తూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ యాక్టర్ ఇపుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్ లో నటించిన క్లైమాక్స్ విడుదవగా… సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. సినిమాల్లో కనిపించాలనే అభిరుచితో నేను మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో చేరాను. యాక్టింగ్ స్కూల్లో నేను గోల్డ్ మెడల్ కూడా అందుకున్నా. ఆ టైంలో ఇండస్ట్రీని ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ ఇండస్ట్రీని ఏలుతున్నారు. ప్రేక్షకులను అటెన్షన్ ను తమవైపు తిప్పుకునేందుకు ఇండస్ట్రీకి ఓ కొత్త వ్యక్తి కావాలని నాకనిపించింది. చార్లీ చాప్లిన్ సినిమాలు చూస్తూ నాకంటూ ప్రత్యేక నటనాశైలిని నేర్చుకున్నా.
నాతో క్లోజ్గా ఉన్న కొంతమంది ఆర్థికంగా నన్ను దెబ్బతీశారు. నేనొక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నపుడు సంపాదించిన డబ్బు మాయమైంది. నేనెంతగానో నమ్మిన వ్యక్తులు నన్ను మోసం చేశారని తెలిసి షాక్కు గురయ్యానని చెప్పుకొచ్చారు.