బంజారాహిల్స్/ మరికల్, మార్చి 7: అమరచింత మాజీ ఎమ్మెల్యే, ఆప్కాబ్ మాజీ చైర్మన్ కొల్లికుదురు వీరారెడ్డి (74) గుండెపోటుతో ఆదివారం కన్నుమూశారు. బంజారాహిల్స్లోని ఎమ్మెల్యేకాలనీలో నివాసం ఉంటున్న వీరారెడ్డిని పదిరోజుల క్రితం జూబ్లీహిల్స్లోని అపోలో దవాఖానలో చేర్పించారు. ఆదివారం ఉదయం గుండెపోటు రావడంతో మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. వీరారెడ్డి సతీమణి రేవతమ్మ ప్రస్తుతం నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు సర్పంచ్గా ఉన్నారు. వీరారెడ్డికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు సోమవారం ఉదయం 11 గంటలకు స్వగ్రామమైన తీలేరులో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.