రామ్స్, శ్వేతావర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘పచ్చీస్’. కత్తూరి కౌశిక్కుమార్, రామసాయి నిర్మాతలు. శ్రీకృష్ణ, రామసాయి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ లోగో, ఫస్ట్లుక్ను హీరో నాగార్జున విడుదలచేశారు. ఆయన మాట్లాడుతూ ‘టైటిల్, ఫస్ట్లుక్ బాగున్నాయి. రామ్స్తో పదేళ్లుగా పరిచయముంది’ అన్నారు. ‘క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిస్తున్నాం. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలో సినిమాను విడుదలచేస్తాం’ అని దర్శకద్వయం చెప్పారు.