వేల్పూర్, జూలై 23: తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన వేల్పూర్ మండలం మోతె గ్రామంలో సీఎం కేసీఆర్ సహకారంతో సాగునీటి సమస్య పరిష్కారమైందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మండలంలోని మోతె గ్రామంలోని పెద్ద చెరువు నుంచి అలుగు పారడంతో మంత్రి ప్రత్యేకపూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న తాగు, సాగు నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు తన దృష్టికి తీసుకొ చ్చారని అన్నారు. ఈ సమస్యను మాటు కాలువతో పరిష్కరించి నట్లు తెలిపారు. మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మాటుకాలువ ద్వారా చెరువులోకి నీరు చేరడంతో అలుగు పారు తున్నది. 35 సంవత్సరాల తర్వాత అలుగు పారుతున్నదని గ్రా మస్తులు తనతో చెప్పారని, ఎంతో సంతోషంగా ఉందని అన్నా రు. అంతకు ముందు వేల్పూర్లోని పెద్దవాగు, మోతె కప్పల వా గును మంత్రి పరిశీలించారు. పెద్దవాగు, కప్పల వాగులపై నిర్మించిన చెక్డ్యాములను పరిశీలించారు. ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాసులు, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్రెడ్డి, ఆర్టీఏ సభ్యుడు రాములు, టీఆర్ఎస్ నాయకులు బాలరాజు, రాజేశ్వర్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.
చెక్డ్యాముకు బైక్పై వెళ్లిన మంత్రి
మండలంలోని మోతె ఆక్లూర్ గ్రామాల మధ్య కప్పల వాగుపై నిర్మించిన చెక్డ్యామును మంత్రి బైక్పై వెళ్లి పరిశీలించారు. రోడ్డు బాగలేక పోవడంతో, చెక్డ్యామ్ వద్దకు కారు వెళ్లడానికి ఇబ్బందిగా ఉండడంతో మంత్రి బైక్పై వెళ్లి చెక్డ్యామ్ను పరిశీలించారు.