బాన్సువాడ, జూలై 14 : ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. బుధవారం ఆయన హైదరాబాద్లోని తన అధికారిక నివాసం నుంచి కోటగిరి మండల ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బాన్సువాడ నియోజకవర్గానికి రూ. వంద కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, 5వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరైనట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. డబుల్ ఇండ్లకోసం అర్హులనే ఎంపిక చేయాలని సూచించారు. నామినేషన్ పద్ధతిలో చేపట్టే పనులను తక్షణమే మొదలుపెట్టాలని, టెండర్లకు సంబంధించిన పనులను అధికారులు ప్రారంభించాలని ఆదేశించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్, కోటగిరి ఎంపీపీ మల్లేపల్లి సునీతా శ్రీనివాస్, జడ్పీటీసీ శంకర్పటేల్, సర్పంచ్ పత్తి లక్ష్మణ్, ఏఎంసీ చైర్మన్ నీరడి గంగాధర్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు సిరాజుద్దీన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎజాజ్ ఖాన్, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, సర్పంచులు, ఎంపీసీలు, ఆయా గ్రామాల కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.