మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి 1,18,000క్యూసెక్కుల భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో 32 వరద గేట్ల ద్వారా గోదావరిలోకి 99,840క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఎస్కేప్ గేట్లతో గోదావరిలోకి 1500 క్యూసెక్కుల నీటిని, కాకతీయ కాలువకు 6వేలు, లక్ష్మి కాలువకు 150, సరస్వతీ కాలువకు 800, వరద కాలువకు 9,746క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుందని తెలిపారు.
ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు(90.313 టీంఎసీలు) కాగా శనివారం సాయంత్రానికి ప్రాజెక్ట్ నీటిమట్టం 1090.90 అడుగులు (89.763 టీఎంసీల) నీటినిల్వ ఉందన్నారు. ఈ సీజనులో ప్రాజెక్ట్లోకి ఇప్పటివరకు 318.503 టీఎంసీల వరద నీరు వచ్చినట్లు ఏఈఈ పేర్కొన్నారు.