బాన్సువాడ/ రామారెడ్డి / సదాశివనగర్/ మాచారెడ్డి, జూలై 16 : రామారెడ్డి మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సర్పంచ్ సంజీవ్, ప్రిన్సిపాల్ మధుశ్రీవాత్సవతో కలిసి పాఠ్యపుస్తకాలను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొవిడ్ నేపథ్యంలో ప్రత్యక్ష తరగతులు నిర్వహించడం లేదని, ఆన్లైన్ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జూమ్ యాప్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది బొర్ర రాజాగౌడ్, సిద్ధయ్య, నాగేశ్వర్రావు, చైతన్య, కృష్ణవేణి, లక్ష్మి, ఉమాకాంత్, బల్వీర్ సింగ్, విద్యార్థులు పాల్గొన్నారు.
సదాశివనగర్ మండలంలోని లింగంపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎస్ఎంసీ చైర్మన్ ర్యాక బాల్కిషన్ గుప్తా హెచ్ఎం సాయిలుతో కలిసి పాఠ్యపుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యార్థులకు ప్రొజెక్టర్, కంప్యూటర్ల ద్వారా నాణ్యమైన విద్యను బోధిస్తున్నట్లు చెప్పారు. లింగంపల్లి గ్రామంలోని అందరూ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటున్నట్లు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు ఒక్క విద్యార్థి కూడా వెళ్లడం లేదని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాయిలు, నర్సయ్య, లింగం, సాయిలు, మధు తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులకు ప్రిన్సిపాల్ శ్రీలత పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులను అందజేశారు. పాఠశాలలోని 480 మంది విద్యార్థులు పుస్తకాలను అందజేసినట్లు తెలిపారు. ఇంటర్ బైపీసీలో అడ్మిషన్లు పూర్తయ్యాయని, ఎంపీసీలో ఖాళీలు ఉన్నాయని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.మాచారెడ్డిలోని విద్యావనరుల కేంద్రంలో మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉచిత పాఠ్యపుస్తకాలను సీఆర్పీలు అందజేశారు. ప్రభుత్వం సరఫరా చేసిన పుస్తకాలను విద్యార్థులకు అందజేయాలని సీఆర్పీలు సూచించారు. కార్యక్రమంలో సీఆర్పీలు సంజీవ్, నరేశ్, సరోజన, సాయిలు, హెచ్ఎంలు బలరాం, బాలు తదితరులు పాల్గొన్నారు.