ఖలీల్వాడి, జూలై 14 : మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. హరితహారంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన, గాంధీచౌక్లో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఐసో టీం ఇండియా , మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిత్రామిశ్రా, జితేశ్ వీ పాటిల్ హాజరై మొక్కలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రతి ఇంటికీ ఆరు చొప్పున మొక్కలను నాటాలని, భావితరాలకు మనం అందించే ఒక గొప్పవరం పచ్చదనమని అన్నారు. కార్యక్రమంలో ఘన్శ్యామ్, డాక్టర్ విష్ణువర్ధన్, డాక్టర్ జగదీశ్వర్, శైలెందర్, ఓంప్రకాశ్, రోషన్లాల్ బోరా, విశాల్, మహిపాల్రెడ్డి, సాయికిరణ్ తదితరులు పాల్గ్గొన్నారు.
అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలన
డిచ్పల్లి, జూలై 14 : మండలంలోని నడ్పల్లి నుంచి బీబీపూర్ తండా వరకు కొనసాగుతున్న అవెన్యూ ప్లాంటేషన్ పనులను ట్రెయినీ కలెక్టర్ మకరంద్ పరిశీలించారు. మొక్కలను పరిశీలించిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. నాటిన ప్రతి మొక్కకూ ట్రీ గార్డును ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో మర్రి సురేందర్, ఎంపీవో రామకృష్ణ, ఏపీవో ఓంకార్ ఉన్నారు.
జక్రాన్పల్లి, కోటగిరి మండలాల్లో..
జక్రాన్పల్లి/కోటగిరి, జూలై 14 : జక్రాన్పల్లిలో సర్పంచ్ చంద్రకళ మొక్కలు పంపిణీ చేశారు. కోటగిరి మండలం సుంకినిలో అంగన్వాడీ కేంద్రం ఆవరణలో సర్పంచ్ మాధవ్రావు ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు.