ధర్పల్లి, జూలై 23 : రాష్ట్ర మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎంపీపీ నల్ల సారిక, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంత్రెడ్డి శనివారం మొక్కలను నాటి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శనివారం నిర్వహించే ముక్కోటి వృక్షార్చనలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారివారి గ్రామాల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
మొక్కలు నాటిన యువకులు
మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా మండలంలోని తొర్లికొండ శివారులో హెచ్పీ గ్యాస్ గోదాం వద్ద స్థానిక యువకులు శుక్రవారం మొక్కలను నాటారు. ముక్కోటి వృక్షార్చనలో భాగంగా ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు కోటపాటి నరసింహనాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
చేపూర్లో హరితహారం
మండలంలోని చేపూర్ గ్రామంలో 63వ జాతీయ రహదారి పక్కన శుక్రవారం మొక్కలు నాటారు. సర్పంచ్ సాయన్న ఉపాధి కూలీలతో కలిసి హరితహారంలో పాల్గొన్నారు. అంతకు మందు ఆయన గ్రామంలోని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు.
ఇరిగేషన్ కార్యాలయంలో..
జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయంలో శుక్రవారం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్వాలిటీ కంట్రోల్ ఈఈ భూమారెడ్డి మొక్కలు నాటారు. డీఈఈ శాంతాబాయి, గంగాధర్ నాయక్, ప్రేమ్కుమార్, ఏఈఈలు పవన్, నిత్య చైతన్య, అధికారులు పోల శ్రీనివాస్, అజీమ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.