ఆర్మూర్ : మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వందశాతం సబ్సిడీపై చేప పిల్లలు అందిస్తుందని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆర్మూర్ పట్టణంలోని గూండ్ల చెరువులో మత్స్యకారులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చెరువుల్లో 58 లక్షల చేప పిల్లలను వదిలినట్లు వివరించారు. అనంతరం మత్స్యశాక ఏడీ ఆంజనేయస్వామి మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.
మత్స్యకారుల అభివృద్ధి కోసం జిల్లాలో 8 కోట్ల పైచిలుకు చేప పిల్లలను చెరువుల్లో విడుదల చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నా, మున్సిపల్ కౌన్సిలర్లు గంగామోహన్ చక్రు, తాటి హన్మాండ్లు, ఆకుల రాము, ప్రసాద్, తలారి మీనా చందు, లింగంపల్లి భాగ్య శివకుమార్, టీఆర్ఎస్ నాయకులు పండిత్ పవన్, పండిత్ప్రేమ్, కాట్పల్లి వెంకట్రెడ్డి, జనార్దన్గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మోత్కురి లింగాగౌడ్, మత్స్యశాఖ మాజీ డైరెక్టర్ సాయిరాం, మత్స్యకారుల సంఘం ఆర్మూర్ మండల అధ్యక్షుడు దాసు తదితరులు పాల్గొన్నారు.