కామారెడ్డి టౌన్, జూలై 16: కామారెడ్డిలోని సమీకృత జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం ప్రకటించిన ప్రతి గ్రామానికి రూ.పది లక్షల నిధులు విడుదల అయ్యాయని కలెక్టర్ శరత్ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పల్లెప్రగతి పెండింగ్ పనులపై సర్పంచులు, మండలస్థాయి అధికారులతో శుక్రవారం సమీక్షను నిర్వహించారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామాలను నెలాఖరు వరకు పూర్తిచేయాలని, లేదంటే సర్పంచులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసంపూర్తిగా ఉన్న కంపోస్టు షెడ్లను త్వరగా పూర్తిచేసి వాడుకలోకి తీసుకురావాలన్నారు. సీజనల్వ్యాధులు ప్రబలకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలు బతకాలని, లేదంటే సర్పంచులు, కార్యదర్శులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ డి.వెంకటమాధవరావు, డీపీవో సునంద, డీఎల్పీవోలు సాయిబాబా, రాజేంద్రప్రసాద్, శ్రీనివాస్, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.