నిజాంసాగర్, జూలై 20: జుక్కల్ మండలంలోని కౌలాస్నాలా ప్రాజెక్టు వరద గేటు ద్వారా మంగళవారం నీటిని విడుదల చేసినట్లు డీఈఈ దత్తాద్రి తెలిపారు. ప్రాజెక్టులోకి 359 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 75 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ ద్వారా ఆయకట్టుకు విడుదల చేయగా, 284 క్యూసెక్కుల నీటిని ఒక వరద గేటు ద్వారా దిగువకు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 458.00 మీటర్లు (1.237 టీఎంసీలు) కాగాత మంగళవారం సాయంత్రానికి 457.85 మీటర్ల (1.20 టీఎంసీలు) వద్ద ఉన్నదని తెలిపారు. ప్రాజెక్టులోకి 359 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అంతే స్థా యి లో నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నా రు. నీటి విడుదల కార్యక్రమంలో ఏఈ రవీందర్, వర్క్ ఇన్స్పెక్టర్ పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.
‘పోచారం’లోకి కొనసాగుతున్న ఇన్ఫ్లో
నాగిరెడ్డిపేట్, జూలై 20: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పోచారం ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం ప్రాజెక్టులోకి 450 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 13.9 అడుగుల నీరు ఉన్నట్లు డీఈఈ తెలిపారు.
72 టీఎంసీలకు ఎస్సారెస్పీ నీటిమట్టం
మెండోరా, జూలై 20: మహారాష్ట్రలోని ప్రాజెక్టుల నుంచి వరదతోపాటు, గోదావరి పరీవాహక ప్రాం తాల్లో కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 72 టీఎంసీలకు చేరిందని ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 7,407 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని పేర్కొన్నారు. వానకాలం పంటల కోసం కాకతీయ కాలువకు 50 క్యూసెక్కులు, గుత్ప ఎత్తిపోతలకు 630 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతున్నదని తెలిపారు. ప్రాజెకు పూర్తిస్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రానికి 1086.60 అడుగుల (72 టీఎంసీలు) వద్ద ఉన్నదని పేర్కొన్నారు. ఈ సీజన్లో ఎగువ ప్రాంతాల నుంచి 57 టీఎంసీల వరద వచ్చి చేరిందని ఏఈఈ తెలిపారు.