సదాశివనగర్, జూలై 16 : ఆయిల్పామ్ సాగుద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని, ఈ పంటను సాగు చేసేందుకు రైతులను రాష్ట్రప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని విశ్వతేజ ఆయిల్ కంపెనీ జనరల్ మేనేజర్ సాంబమూర్తి, డిప్యూటీ మేనేజర్ మాణిక్యరెడ్డి, మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదిక భవనంలో రైతులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రైతులు ఆయిల్పామ్ సాగుపై దృష్టిసారించాలన్నారు. రైతులు పంటను మూడు సంవత్సరాల వరకు పెంచాలని, అప్పటి నుంచి దిగుబడి వస్తుందని తెలిపారు. 6వ సంవత్సరం నుంచి ఎకరానికి 10 టన్నులకు పైగా దిగుబడి వస్తుందన్నారు. పంటను ఒకసారి వేస్తే 40 సంవత్సరాల వరకు కొనసాగుతుందన్నారు. ఆయిల్పామ్లో అంతర్పంటలుగా మిరప, పత్తి, మక్కజొన్న, కందులు, వేరుశనగ, చెరుకు, జొన్న, మినుములు, నువ్వులు, అరటి, పెసర్లు తదితర పంటలను కూడా సాగుచేసుకోవచ్చని తెలిపారు. సమావేశంలో సర్పంచులు బద్దం శ్రీనివాస్రెడ్డి, ముడుపు బాల్రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, విండో చైర్మన్ కమలాకర్ రావు, ఉపసర్పంచ్ రవి, బాల్రెడ్డి, కరుణాకర్ రావు, సంతోష్ రెడ్డి, ఏఈవోలు కవిత, శ్రీనివాస్ నాయక్, శ్రీనివాస్ రెడ్డి, స్నేహలత, హారిక, శిరీష పాల్గొన్నారు.
రైతులకు పంటల సాగుపై శిక్షణ
మండల కేంద్రంతోపాటు అన్నారం, కన్నాపురం, పోసానిపేట్లో మండల వ్యవసాయ అధికారి హరీశ్ కుమార్ ఆధ్వర్యంలో రైతులకు పంటల సాగుపై శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. శిక్షణలో భాగంగా సన్నరకం వరి సాగులో మెళకువలతోపాటు పంట రుణాలు, పంట మార్పిడి విధానం, వివిధ పథకాలపై రైతులకు వివరించారు. కార్యక్రమంలో ఏఈవోలు ప్రియాంక, రాకేశ్, ప్రణీత, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితి సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.