వేల్పూర్/భీమ్గల్/కమ్మర్పల్లి, అక్టోబర్ 12 : అన్ని వర్గాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ ధ్యేయమని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మంత్రి వేల్పూర్లోని తన నివాసంలో వివిధ కుల సంఘాల నూతన భవనాల నిర్మాణం కోసం మంజూరైన 28 లక్షల ప్రొసీడింగ్ పత్రాలను ప్రతినిధులకు మంగళవారం అందజేశారు. నిధులు మంజూరు చేసిన మంత్రికి కుల సంఘాల సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. జడ్పీటీసీ భారతి, పార్టీ మండల కన్వీనర్ నాగధర్రెడ్డి, జిల్లా ఆర్టీఐ సభ్యుడు రాములు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలో వివిధ కుల సంఘాల ప్రతినిధులకు నూతన భవనాల నిర్మాణం కోసం మంజూరైన రూ.37 లక్షల ప్రొసీడింగ్ పత్రాలను మంత్రి అందజేశారు.
జడ్పీటీసీ రవి, మండల కన్వీనర్ నర్సయ్య, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మోయిజ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ శర్మనాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలం కోనాసముందర్లోని దళితసంఘం ‘ఏ’కు రూ.5 లక్షలు, దళిత సంఘం‘బీ’కు రూ.4 లక్షలు, హాసాకొత్తూర్లోని మాల సంఘానికి రూ.4 లక్షలు, మాదిగ సంఘానికి రూ.4 లక్షలు, చౌట్పల్లిలోని వడ్డెర సంఘానికి రూ.5 లక్షలు మంజూరుకాగా ప్రొసీడింగ్ పత్రాలను కుల సంఘాల పెద్దలకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రిని ఆయా గ్రామాల కుల సంగాల పెద్దలు సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, ఏఎంసీ చైర్మన్ మాలవత్ ప్రకాశ్, వైస్ ఎంపీపీ కాలేరు శేఖర్, ఆయా గ్రామాల టీఆర్ఎస్ నాయకులు శంకర్, గోపి, రాజన్న, కిరీటి, లింబాద్రి, అశోక్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన గ్రంథాలయ చైర్మన్
జిల్లా గ్రంథాలయ చైర్మన్గా నూతనంగా నియమించబడిన ఎల్ఎంబీ రాజేశ్వర్ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని వేల్పూర్లోని ఆయన స్వగృహంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో గ్రంథాలయాలను సందర్శించి వాటి స్థితిగతులను తెలుసుకోవాలని సూచించారు. నూతనంగా ఏర్పాటు చేయాల్సిన లైబ్రరీలు ఎక్కడ అవసర మున్నాయో వాటి వివరాలను తెలుసుకోవాలన్నారు. మంత్రిని కలిసిన వారిలో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్ రెడ్డి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మోయిజ్, భీమ్గల్ మండల కన్వీనర్ దొన్కంటి నర్సయ్య తదితరలు ఉన్నారు.