డిచ్పల్లి, జూలై 18: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సతీమణి శోభారాణి అనారోగ్యంతో పది రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం డిచ్పల్లి మండలంలోని బర్ధిపూ ర్ శివారులో ఉన్న బృందావన్ గార్డెన్లో శోభారాణి ద్వాదశ దినకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హాజరై శోభారాణి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను పరామర్శించారు. శ్రద్ధాంజలి ఘటించిన వారిలో అర్బన్, ఆర్మూర్, జుక్కల్ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్గుప్తా, జీవన్రెడ్డి, హన్మంత్ షిండే, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్, ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మార్క్ఫెడ్ రాష్ట్ర చైర్మన్ మార గంగారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్కుమార్, నగర మేయర్ నీతూ కిరణ్, మాజీ మేయర్ ఆకుల సుజాత, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఈగ సంజీవ్రెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, డీసీసీబీ డైరెక్టర్లు, విండో చైర్మన్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.