నిజామాబాద్ రూరల్, జూలై 19 : గ్రామంలో నివాసముంటున్న ప్రజల అవసరాలకనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం సంసద్ ఆదర్శ గ్రామ యోజన(ఎస్ఏజీవై)పథకాన్ని ప్రవేశపెట్టిందని ఈజీఎస్ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ సంజీవ్కుమార్ అన్నారు. ఎస్ఏజీవై పథకం కింద ఎంపికైన పాల్ద గ్రామంలో సర్పంచ్ సుప్రియానవీన్ అధ్యక్షతన సోమవారం మండల, గ్రామస్థాయి అధికారులతోపాటు గ్రామపెద్దలతో నిర్వహించిన సమావేశానికి సంజీవ్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామస్తులు సంపూర్ణ సహకారం, పాలకవర్గం, అధికారుల సమష్టికృషి ఫలితంగా పల్లెప్రగతిలో పాల్ద జిల్లాస్థాయిలో ఉత్తమ జీపీగా ఎంపికకావడం అభినందనీయమని అన్నారు. ఎస్ఏజీవైకి ఎంపికతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందన్నారు.
గ్రామంలో సీసీ డ్రైనేజీలు, రోడ్లు, సొసైటీ కార్యాలయం నుంచి అరకిలోమీటర్ దూరం వరకు పంట ఉపకాలువకు సీసీ లైనింగ్ తదితర అభివృద్ధి పనులు చేపట్టాలని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. నివేదికను రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తామని ఎంపీడీవో మల్లేశ్ అన్నారు. సమావేశంలో ఎంపీటీసీ ఆమని, ఉపసర్పంచ్ నరేశ్, ఈజీఎస్ ఏవో నారాయణ, ఏఈ నరేశ్, ఎంపీవో మధురిమ, స్పెషల్ ఆఫీసర్, ఏవో హీరాజాదవ్, మండల పశు వైద్యాధికారి ప్రమోద్కుమార్, గిర్దావర్ భూపతిప్రభు, ఏపీవో పద్మ, అంగన్వాడీ సూపర్వైజర్ విజయలక్ష్మి, ఆయా శాఖల అధికారులు, గ్రామపెద్దలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.